NLR: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధానంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం, అనంతరం కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం 6గంటలకు బంగారు హనుమంతు సేవ నిర్వహిస్తామని తెలిపారు.