PPM: సాలూరు రూరల్ ఎస్సైగా బి. రవీంద్ర రాజు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఇంఛార్జ్ ఎస్సై వెంకటరమణ నుంచి బాధ్యతలు చేపట్టారు. పార్వతీపురం సైబర్ సెల్ విభాగంలో పనిచేసిన రవీంద్రరాజును ఎస్పీ సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.