NTR: మైలవరం యువత అధ్యక్షుడిగా మూడోసారి నియమితులైన లంక సతీశ్ను MRPS ఇంఛార్జ్ శరత్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోనే స్మశాన వాటిక లేని గ్రామంగా సజ్జపాడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఈ సమస్యను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన స్మశాన వాటిక మంజూరయ్యేలా కృషి చేస్తానని సతీశ్ హామీ ఇచ్చారు.