W.G: కోలనపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పనుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 గం. నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు కోలనపల్లి గ్రామానికి, స్థానిక చెరువులకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల నిర్మాణ పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలన్నారు.