E.G: రాజమండ్రి మహిళా కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బుధవారం సందర్శించి ఖైదీల సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదులు లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, బెయిల్ లేదా అప్పీలు దాఖలుకు సంస్థ సహకరిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఆహార నాణ్యతపై ఆరా తీస్తూ, ఖైదీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.