AP: పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో నిందితుడికి మాచర్ల కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. నిందితుడు నామాల శ్రీనును నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం మాచర్ల కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో గురజాల సబ్ జైలుకు తరలించారు.