KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు తీవ్రమయ్యాయి. బుధవారం చాగలమర్రిలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 41.8, కౌతాళంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యుడి భగభగలతో మధ్యాహ్నం పట్టణాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాల్పుల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.