KRNL: గూడూరు మండలం పెంచికలపాడుకు చెందిన గాడే చరిత ఇంటర్మీడియట్ ఫలితాల్లో 988 మార్కులు సాధించి సత్తా చాటింది. నంద్యాల జిల్లా నెరవాడ ప్రభుత్వ ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదువుతూ ఆమె ఈ ఘనత సాధించింది. తన తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ తనను చదివించారని చరిత పేర్కొంది. ఫలితాలలో పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.