ELR: నూజివీడు పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీ డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్లో శనివారం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ నవీన లావణ్య లత మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ షేక్ అన్వర్ భాష, టి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.