KRNL: కర్నూలు నగరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా విభేదాలు భగ్గుమన్నాయి. కొండారెడ్డి బ్రిడ్జి వద్ద జేసీ నూరల్ కమర్ సమక్షంలో జరిగిన సభలో అధికారులు, వెల్ఫేర్ సంఘం నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ఉత్సవాలు నిర్వహిస్తూ, తమను ఆహ్వానించకపోవడంపై ఏపీ షెడ్యూల్ కులాల వెల్ఫేర్ సంఘం నేతలు అధికారులను నిలదీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.