సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్లో జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి, పారిశుధ్యం మెరుగుదలపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాల్లో పారిశుధ్యంపై ఎలాంటి రాజీ పడకుండా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.