KRNL: ఆదోని నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు 30 మందికి రూ.12.63 లక్షల చెక్కులు అందజేశారు. గత 18 నెలల్లో 519 మందికి రూ.1.85 కోట్లు సహాయం అందినట్లు తెలిపారు. మరిన్ని అర్హులకు సహాయం కొనసాగుతుందని సీనియర్ నాయకులు పేర్కొన్నారు.