NDL: ఉయ్యాలవాడ మండలం ఆర్.జంబులదిన్నె సమీపంలోని పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం లభించింది. మంగళవారం సుమారు 45ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్సై ప్రతాపరెడ్డి చేరుకుని 108లో ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.