ELR: చింతలపూడి మండలం రాఘవాపురంలో బుధవారం విషాదం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన వేదుళ్ల సత్యనారాయణ(55) అనే వ్యక్తి పొలంలో పని చేస్తూ ఉండగా పాముకాటుకు గురయ్యాడు. స్పందించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.