KRNL: ఎమ్మిగనూరులో పాల డైరీ కేంద్రాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక తిరుమల పాల డైరీ కేంద్రాన్ని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ పరిశీలించి పాల పాకెట్లు, పాలను ల్యాక్టోమీటర్తో పరీక్షించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో పాల శ్యాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.