శ్రీకాకుళం: కాశీబుగ్గ డీఎస్పీగా టి. భవాని బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ వన్ పరీక్షలలో విజయం సాధించి, శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో నేరాలు, భద్రతా చర్యలపై దృష్టి సారిస్తానని, సిబ్బంది సహకరించాలని ఆమె కోరారు.