CTR: కల్లూరు ఎస్సై జయరామయ్య పులిచెర్ల మండలంలో ఆటో డ్రైవర్లకు శుక్రవారం అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ లోడ్ తగదన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.