W.G: ఉండి పెదపేటలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉండి ఎస్సై మహమ్మద్ నజీరుల్లా అహ్మద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకుని పోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావు, V. విజయ్ కుమార్, చిట్టూరి జోషి తదితరులు పాల్గొన్నారు.