ప్రకాశం: కనిగిరి మండలంలో శంఖవరంకు చెందిన తమ్మిశెట్టి పద్మ మంగళవారం ఎలుకలు మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. కాగా తనకు పిల్లలు లేరని, అనారోగ్య కారణాలు ఉన్నాయని మానసికంగా కుంగిపోయి, మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.