BPT: అమృతలూరు మండలం ఇంటూరులో పీఎం సూర్యఘర్ ఎస్సీ, ఎస్టీ పథకాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ పథకంతో లబ్ధిదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. దీంతో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. వేమూరు నియోజకవర్గంలో 7,172 మంది దరఖాస్తు చేసుకున్నారు.