TPT: తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్లో విషాదం నెలకొంది. కేవీపల్లె మండలం నూతన కాలువ గ్రామం దిన్నెవడ్డేపల్లికి చెందిన చెంచయ్య(40) నూతన భవన నిర్మాణ పనులకు వచ్చాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈస్ట్ ఎస్సై రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.