BPT: భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యతగా పని చేయాలన్నారు.