BPT: రేపల్లె నియోజకవర్గంలోని నగరం ఎస్టీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ను మంత్రి పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 7.7 లక్షల కనెక్షన్లను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.