అనకాపల్లి: అచ్యుతాపురం మండలం మార్టూరు గ్రామానికి చెందిన 150 మంది వైసీపీ శ్రేణులు టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సమక్షంలో శనివారం టీడీపీలోకి చేరారు. వారందరికీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో సర్పంచ్ రమేష్ రాజు, మాజీ సర్పంచ్ సీతారామచంద్రరాజు, మాజీ ఎంపీటీసీ గుర్రం అప్పారావు ఉన్నారు.