SKLM: ఇచ్చాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు గురువారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పురుషోత్తపురం గ్రామంలో షిర్డీ సాయిబాబా దేవాలయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.