NTR: జగ్గయ్యపేటలో వైసీపీ నాయకులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు నేతృత్వంలో సీతారాంపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలు ఆపాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తప్పించాలని అన్నారు.