CTR: బైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల గ్రామంలోని శ్రీ మరగదాంబ సమేత మార్గసాహేశ్వరస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పూజ కార్యక్రమాలలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పాల్గొన్నారు. మరగదాంబ సమేత మార్గసాహేశ్వర స్వామి ఆశీస్సులతో పలమనేరు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు ఆయన చెప్పారు.