TPT: పెళ్లకూరు (M) దిగువ చావలి గ్రామపంచాయతీలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళల అవగాహన ర్యాలీ నిర్వహించారు. “టీబీ నివారణ మా లక్ష్యం-క్షయ వ్యాధి రహిత రాష్ట్రమే మా ధ్యేయం” అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ప్రతి పౌరుడు వ్యాధి బారిన పడకుండా కాపాడడం మన బాధ్యత అని పంచాయతీ కార్యదర్శి మాధవి, ఏఎన్ఎం శోభన తెలిపారు.