KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో మనేకుర్తిలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరి సమస్యలు నేరుగా తెలిపారు. కొన్నింటిని అక్కడే పరిష్కరించారు, మిగతా సమస్యలకు త్వరిత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని, సమస్యలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.