కృష్ణా: చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ను ఎట్టకేలకు బయటకు తీశారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద చెట్లకు నీళ్లు పోస్తున్న ట్రాక్టర్ను వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ లోపలే ఇరుక్కుపోయాడు. సుమారు అరగంటపాటు శ్రమించి క్రేన్ సహాయంతో బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.