నెల్లూరు: బుచ్చి పట్టణంలో కమిషనర్ చినబాబు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి రోడ్లమీద చెత్త వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. చెత్తను ప్రతిరోజు ఎప్పటికప్పుడు తరలించారని అధికారులకు ఆదేశించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారస్తులు సహకరించాలన్నారు.