PPM: జిల్లాలో జరుగుతున్న రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మరింత వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి జె.సీలను, సబ్ కలెక్టర్లను ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా నుంచి అర్హులైన వారి భూములకు హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జె.సి, సబ్ కలెక్టర్లతో సమీక్షించారు.