ప్రకాశం: బేస్తవారిపేట మండలం బసినేనిపల్లిలో సోమవారం డ్రోన్లు ఉపయోగించి పురుగుమందు పిచికారిపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రఫీ మాట్లాడుతూ.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ముఖ్యంగా పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లడానికి పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ముఖ్యమైన భాగంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.