KRNL: దేవనకొండ మండలం ఎంకే కొట్టాలలో విద్యుత్ శాఖ ఏఈ రవీంద్ర ఆధ్వర్యంలో ఇవాళ కరెంటోళ్ల ‘జనం బాట’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని, లో వోల్టేజ్, మీటర్ రీడింగ్ సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని, తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.