ELR: ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఆదివారం రూ. 4.02 కోట్లతో 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి గృహనిర్మాణ మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు.