గుంటుపల్లి గవర్నమెంట్ హైస్కూల్లో ఎన్టీఆర్ వికాస్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 నుంచి రూ.35,000 వరకు జీతం ఉంటుందని చెప్పారు.