SKLM: జిల్లాలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ సతీమణి స్వాతి శంకర్ మంగళవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని బాధితులకు భరోసా కల్పించారు.