AKP: నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ నాగజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం 8వ పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలకు సెల్ పోన్లు ఇవ్వడం ద్వారా కంటి చూపు సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే మెదడు అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్నారు. బయట దొరికే ఆహారం కాకుండా ఇంట్లోనే దొరికే పౌష్టికాహారంను తయారు చేసి పెట్టాలన్నారు.