VSP: ఆస్తిపన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీతో జీవీఎంసీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.552.50 కోట్లు వసూలై, గత ఏడాదితో పోలిస్తే రూ.116.3 కోట్లు అధికంగా నమోదయ్యాయి. మొత్తం లక్ష్యం రూ.569.59 కోట్లు కాగా, మార్చి 31లోపు రాయితీ గడువు ఉండటంతో చివరి రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.