KRNL: హలహర్వి మండలం బిలేహల్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. జనసేన నేత మల్లికార్జున ఆధ్వర్యంలో ఇవాళ రుద్రముణి స్వామి గుడి నుంచి గాదలింగప్ప ఇంటివరకు నిర్మాణం చేపట్టారు. ఏళ్లుగా బురద సమస్యతో ఇబ్బందులు పడ్డ గ్రామస్తులు, రోడ్డు మంజూరు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు భావిస్తున్నారు.