సత్యసాయి: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని అంతమొందిస్తామంటూ వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులపై శనివారం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మవరం సీఐ ప్రభాకర్ గౌడ్ను కలిసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకత్వ ప్రోత్సాహంతోనే తనపై ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.