కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్లో భాగంగా 3, 4, 5వ డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉకాయపల్లి GTS సెంటర్ను సందర్శించి చెత్త తరలింపు విధానం, పరిశుభ్రతను సమీక్షించారు. హాజరు నమోదు పరిశీలించి సమయపాలన పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని కమిషనర్ హెచ్చరించారు.