KDP: సి.కె దిన్నె పరిధిలో రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో ఊటుకూరు సర్కిల్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్, ఓవర్ స్పీడ్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.