కోనసీమ: విద్యార్థుల భవిష్యత్తుకు మార్కులే పునాది అని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం జెడ్పీ హైస్కూల్లోని పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఈ ప్రక్రియను పవిత్ర బాధ్యతగా చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థి జీవితంలో ఇది కీలక మలుపు అని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.