KDP: ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆరోగ్యం, ఆదాయం, దిగుబడి ఉంటుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇవాళ పులివెందుల పట్టణంలోని స్థానిక ఏపీ కార్ల్లో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి మార్పులకు అనుగుణంగా పంటల సాగు, జీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీపై అవగాహన కల్పించారు.