AKP: మాకవరపాలెం మండలంలోని 31 పంచాయతీల్లో మొత్తం 46,985 మంది ఓటర్లు ఉన్నారని డిప్యూటీ ఎంపీడీవో మేరీజోన్స్ శుక్రవారం తెలిపారు. వీరిలో 22,875 మంది పురుషులు, 24,110 మంది మహిళలు ఉన్నారు. ఈనెల 15న ఓటర్ల జాబితాలను అన్ని పంచాయతీల్లో ప్రదర్శించామని చెప్పారు. మాకవరపాలెంలో 3,777 మంది ఓటర్లతో అధికం, నారాయణరాజుపేటలో అత్యల్పంగా 466 మంది ఉన్నారని పేర్కొన్నారు.