KRNL: గూడూరులోని శ్రీ తిమ్మ గురుడు స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ఈవో గురెడ్డి, చైర్మన్ ప్రభాకర్ నాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపులో జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.53 వేల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.