KRNL: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలులోని సి. క్యాంప్ రైతు బజార్ను శనివారం కలెక్టర్ డా.ఏ.సిరి ఆకస్మికంగా పరిశీలించారు. వ్యర్థ కూరగాయలు, ఆకు కూరలతో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు బజారులో కూరగాయలను విక్రయిస్తున్న వారితో మాట్లాడి, వారి స్థితిగతులపై ఆరా తీశారు.