KDP: టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ నేత బాలిశెట్టి ప్రసాద్ను ఇవాళ కమలాపురం MLA పుత్తా చైతన్య రెడ్డి సన్మానించారు. పార్టీ అధిష్టానం బాలిశెట్టి ప్రసాద్ సేవలను గుర్తించి అత్యున్నత పదవిని అప్పగించడం పట్ల MLA సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకం ద్వారా రాబోయే రోజుల్లో జిల్లాలో TDP మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.