NDL: బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు అమ్మవారిని పల్లకీలో ఆశీనులుగా చేసి ప్రత్యేక అలంకరణలతో శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు ఘనంగా సాగింది. వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.